Wednesday, 8 April 2015

రెండేదారులు

తెలుగు మీడియాను  పోలీస్ భూతం అవహించింది !!

"మీడియా  ప్రెస్టిట్యూట్స్‌"   -  కేంద్ర మంత్రి వీకే సింగ్‌
ఈ వార్త చదివినపుడు వీకే సింగ్ మీద ముందు నాకూ కోపం వచ్చింది.

కానీ, శేషాచలంలో  ఎర్రచందనం కూలీలు ఇరవై మందిని పోలీసులు కిరాతకంగా చంపినపుడు తెలుగు మీడియా సంస్థలు ఖండించలేదు. పైగా, ఏదో పండగలా ఉత్సవం జరుపుకున్నాయి. NHRC " the incident involved a serious violation of human rights of individuals"  అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కూడా తెలుగు  మీడియా పట్టించుకోలేదు.  తెలుగు మీడియాను  పోలీస్ భూతం అవహించింది !!


రెండేదారులు

నల్లమల అడవుల నుండి ఎర్రచందనం బయటికి పోవడానికి రెండే దారులున్నాయి.  కడప మీదుగా కర్నాటక పోవాలి. చిత్తూరు మీదుగా తమిళనాడుపోవాలి.

1995 నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రులందరూ (రోశయ్యగారి స్వల్పకాలం మినహా)  చిత్తూరు, కడప జిల్లాలకు చెందినవారే. రక్తచందనం స్మగ్లర్లు ఎవరో ఆ జిల్లాలకు చెందిన ముఖ్యమంత్రులకే తెలీదు అనుకోవాలా? 

No comments:

Post a Comment