Wednesday, 8 April 2015

ఆ ఎన్ కౌంటర్ సరైందే - ముద్దు కృష్ణమ్మ నాయుడు..

ఆ ఎన్ కౌంటర్ సరైందే - ముద్దు కృష్ణమ్మ నాయుడు..

16:03 - April 8, 2015
తిరుపతి : శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌ పై విమర్శలు వస్తుంటే టిడిపి నేత ముద్దు కృష్ణమ్మ నాయుడు మాత్రం సమర్థించారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన సంపదను కాపాడడానికి పోలీసులు స్మగ్లర్లను ఎన్‌కౌంటర్‌ చేస్తే కొన్ని పార్టీలు విమర్శలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వాల అసమర్ధ పాలన వల్లే వేల కోట్ల రూపాయల ఎర్రచందనం స్మగ్లర్ల పాలయిందని విమర్శించారు. స్మగ్లర్లు ఎర్రచందనాన్ని తరలించుకుపోతుంటే..ఫారెస్టు అధికారులను చంపేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా..? అంటూ ముద్దు కృష్ణమనాయుడు ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను తాను అభినందిస్తున్నానన్నారు.



కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు

Sakshi | Updated: April 08, 2015 15:06 (IST)
కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు
హైదరాబాద్ : దోచుకుని పోతున్న వారిని కాల్చేందుకు కాకపోతే.. అసలు పోలీసులకు ఆయుధాలుండి ఉపయోగం ఏంటని మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఎర్రచందనం ఏపీ రాష్ట్ర సంపద అని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా విలువ చేసే ఎర్ర చందనం తరలిపోయిందని ఆయన తెలిపారు. శేషాచలం ఎన్ కౌంటర్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినది మంచిపనేనని ఆయన అన్నారు.

No comments:

Post a Comment